Nepal PM : భారత్-నేపాల్ మధ్య అపార్థాలు తొలగిపాయాయ్
నేపాల్-భారత్ దేశాల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు.
Nepal PM నేపాల్-భారత్ దేశాల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోయాయని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు. ఇరు దేశాలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టాలన్నారు.సరిహద్దు దేశాలు కష్టాలను,ప్రేమను కూడా పంచుకుంటాయన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నేపాల్ ప్రధాని మాట్లాడుతూ..ఇరు దేశాల మధ్య ఒక సమయంలో అపార్థాలు తలెత్తిన విషయం నిజమే.. కానీ ఇప్పుడు ఆ అపార్థాలు తొలగిపోయాయన్నారు. సరిహద్దు దేశాల మధ్య సమస్యలు రావడం సహజమని.. చిలీ- అర్జెంటీనా దేశాల మధ్య సమస్యలు ఉండట్లేదా?అని ఓలీ ప్రశ్నించారు. తొలగిపోయిన అపార్థాల గురించే ఆలోచించకకుండా భారత్-నేపాల్ దేశాలు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టి ముందుకుసాగాలని ఓలీ అన్నారు. ఇరు దేశాలు పాజిటివ్ రిలేషన్ షిప్ ను కలిగి ఉండాలన్నారు. సరిహద్దు దేశాలు కష్టాలు,ప్రేమను పంచుకుంటాయన్నారు. ఇతర దేశాల కన్నా నేపాల్ కు భారత్ తో ప్రత్యేక అనుబంధం ఉందని ఓలీ అన్నారు.
కరోనా వేళ నేపాల్ కు ఇతర దేశాలతో పోలిస్తే భిన్న రీతిలో భారత్ సాయం అందించాలన్నారు. ఇరు దేశాలకు ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి నేపాల్లోని పలు ప్రాంతాలపై భారత్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో మహమ్మారిని కట్టడి చేయగలిగినా.. నేపాల్లో పరిస్థితి మారకపోతే దాని వల్ల ఫలితం ఉండదన్నారు. మరోసారి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
కరోనా వేళ వ్యాక్సిన్, వైద్య సహాయం అందించినందుకు భారత్కు ధన్యవాదాలు చెప్పిన ఓలీ.. నేపాల్ ఆశించినంత సాయంలో భారత్ ఆదుకోలేదని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యల అర్థం.. తమకు భారత్ నుంచి సాయం అందలేదని ఆరోపిస్తున్నట్టు కాదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నేపాల్ కు.. చైనా 18 లక్షల టీకాలను పంపిణీ చేసిందని, భారత్ 21 లక్షల టీకాలను అందించిందని ఓలీ తెలిపారు. ఇరు దేశాలు వైద్య పరికరాలను కూడా పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు ఓలీ ధన్యవాదాలు చెప్పారు.