Haryana : నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. రోల్స్ రాయిస్ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

Nuh, Haryana
Haryana : హర్యానాలోని నూహ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ రోల్స్ రాయిస్ను ఢీకొట్టడంతో ట్యాంకర్ డ్రైవర్, హెల్పర్ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రోల్స్ రాయిస్ తుక్కు తుక్కైనట్లు తెలుస్తోంది.
Road Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బైకును ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
ఢిల్లీ-ముంబయి-బరోడా ఎక్స్ ప్రెస్ హైవేపై హర్యానాలోని నూహ్లో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్, అతని హెల్పర్ చనిపోయారు. ట్యాంకర్ లో ఉన్న మరో వ్యక్తి గౌతమ్ గాయపడినట్లు తెలుస్తోంది. రోల్స్ రాయిస్లో ప్రయాణిస్తున్న చండీగఢ్ నివాసితులు దివ్య, తస్బీర్లుగా , మరొకరు ఢిల్లీ వాసి వికాస్గా గుర్తించారు. వీరు ముగ్గురు గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో ఇద్దరు మృతి
నగీనా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామం సమీపంలో మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ సైడ్ నడుపుతున్న ట్యాంకర్ వేగంగా వచ్చి రోల్స్ రాయిస్ను ఢీ కొట్టింది. ట్యాంకర్ ఢీ కొట్టిన వెంటనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రోల్స్ రాయిస్కి కొంచెం దూరంలో కారులో వస్తున్న వారి బంధువులు తక్షణం స్పందించి రక్షించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన ట్యాంకర్ డ్రైవర్ రామ్ ప్రీత్ , అతని హెల్పర్ కుల్దీప్లను ఉత్తరప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల నుంచి ప్రమాద వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.