Bharat Jodo Yatra Telangana: తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (ఫొటో గ్యాలరీ)
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని గోప్లపుర్కలాన్ వరకు సాగింది. సాయంత్రం సమయంలో మన్యంకొండ ప్రాంతం మీదుగా యాత్ర సాగింది. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ స్థానిక ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్రపొడవున ప్రజలు రాహుల్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్ పలు ప్రాంతాల్లోని ప్రజలను పలుకరిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.