Rahul Gandhi Bharat Jodo Yatra: ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. (ఫొటోలు)
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో కొనసాగుతోంది. ఇండోర్ జిల్లాలోని సన్వెర్ పట్టణం నుండి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. ఉజ్జయినిలో షిప్రా నది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగ భగవానుడు మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాహుల్ పాదయాత్రలో భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్రలో భాగంగా స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.