Tamil Nadu: చూసుకుందాం అంటే చూసుకుందాం.. సీఎం స్టాలిన్కు తమిళనాడు బీజేపీ చీఫ్ సవాల్
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్ను పంచుకున్నందుకు ఆర్ఎస్ భారతికి ధన్యవాదాలు తెలిపారు

annamalai vs stalin
Tamil Nadu: తమ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అయితే దీనిపై తాను కూడా చట్టపరంగానే తేల్చుకుంటానని అన్నామలై సవాల్ విసిరారు. డీఎంకే డిమాండ్ చేసినట్లుగా క్షమాపణ చెప్పబోనని, అలాగే జరిమానా కట్టనని ఆయన సోమవారం స్పష్టం చేశారు.
సీనియర్ న్యాయవాది, డీఎంకే రాజ్యసభ ఎంపీ పీ.విల్సన్ భారతి సూచనల మేరకు ఏప్రిల్ 15 నాటి నోటీసు జారీ చేశారు. తమిళనాడులో రాజకీయంగా ముద్ర వేయలేకపోయిన అన్నామలై డీఎంకే నేతలను అప్రతిష్టపాలు చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని, ‘డీఎంకే ఫైల్స్’ వీడియో క్లిప్ వారిపై నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తోందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. డీఎంకే ఆస్తుల విలువను ఎక్కువ చేసి రూ.1,408.94 కోట్లుగా చూపించారని నోటీసులో పేర్కొన్నారు.
Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ..
వీడియోలో ఒక వ్యక్తికి చెందిన ఆస్తులు పార్టీకి చెందినవిగా చూపించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఆర్ఎస్ భారతి లీగల్ నోటీసు ద్వారా బీజేపీకి అందిన రూ.5,270 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కూడా ప్రశ్నించారు. కాగా దీనిపై అన్నామలై స్పందిస్తూ తాను సోషల్ మీడియా నుంచి వీడియోను తొలగించబోనని, అన్ని చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. బీజీఆర్ సంబంధిత కుంభకోణాన్ని బయటపెట్టినందుకు రూ.500 కోట్లు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ దుబాయ్ పర్యటనకు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు డీఎంకే రూ.500 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరిందని కే అన్నామలై తెలిపారు.
Punjab: స్వర్ణ దేవాలయం ఇండియాలో లేదట, పంజాబ్లో ఉందట.. త్రివర్ణ పతాకం ఉందని లోపలికి అనుమతించలేదు
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్ను పంచుకున్నందుకు ఆర్ఎస్ భారతికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో డీఎంకే హయాంలో జరిగిన చెన్నై మెట్రో కుంభకోణంపై పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని సీబీఐకి సమర్పిస్తానని చెప్పారు. అయితే డీఎంకే నేతలకు సమన్లు అందే వరకు ఓపిక పట్టాలని ఆర్ఎస్ భారతిని అన్నామలై కోరారు.