Nikhat Zareen : ఆసియా బాక్సింగ్ క్రీడల్లో నిఖత్ జరీన్కు కాంస్య పతకం…ఎమ్మెల్సీ కవిత అభినందన
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ ఆసియా బాక్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న నిఖత్ జరీన్ తన 19వ ఆసియా బాక్సింగ్ క్రీడల పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది....
Nikhat Zareen : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ ఆసియా బాక్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ ఛాంపియన్గా ఉన్న నిఖత్ జరీన్ తన 19వ ఆసియా బాక్సింగ్ క్రీడల పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. (bronze in Asian Games) ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల సెమీఫైనల్లో నిఖత్ జరీన్ 3:2 తేడాతో థాయిలాండ్కు చెందిన చుతామత్ రక్షత్ చేతిలో ఓడిపోయింది.
ఆసియా క్రీడల్లో తీవ్రంగా పోరాడి కాంస్య పతకం గెల్చిన నిఖత్ జరీన్ ను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. (BRS MLC Kavitha lauds Nikhat Zareen) ‘‘నిఖత్ జరీన్ కు అభినందనలు! నిజామాబాద్, తెలంగాణ, భారతదేశానికి గర్వకారణమైన నిఖత్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ప్రకాశించింది’’ అని కల్వకుంట్ల కవిత తన ట్వీట్లో రాశారు.
Pawan Kalyan : అవనిగడ్డ సభలో బీజేపీ ఊసెత్తని పవన్ కల్యాణ్..
సెమీఫైనల్ పోటీలో స్ప్లిట్ నిర్ణయంపై థాయ్ అమ్మాయి 2-1 తేడాతో గెలిచింది. జరీన్ మొదటి రౌండ్లో గెలిచింది, కానీ ఆమె ప్రత్యర్థి తరువాతి రెండు రౌండ్లలో విజేతగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్లో జరీన్, రక్షత్ ఒకరితో ఒకరు తలపడ్డారు. గతంలో జరిగిన ఆ పోటీలో భారత బాక్సర్ నిఖత్ విజేతగా నిలిచారు. ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య పతక విజేత బాక్సర్ పర్వీన్ హుడా ఆదివారం హాంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్లో 57 కిలోల సెమీఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా భారతదేశానికి పతకం, పారిస్ ఒలింపిక్ కోటాను కూడా కైవసం చేసుకుంది.