రెండు అంగుళాలు.. రెండే పరుగులు.. ఒక ఒటమి.. వంద రికార్డు..
IPL 2020, KXIP vs KKR: ఐపీఎల్ 2020లో 24వ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠబరితంగా జరిగింది. ఈ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బలమైన స్థితిలో ఉండి కూడా చివరకు ఓడిపోయింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్లో దాదాపుగా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు చేసుకుంది.
మ్యాచ్ 19 వ ఓవర్లో KKR ఫాస్ట్ బౌలర్ కృష్ణ మ్యాచ్ను మార్చేశాడు. అతను కెప్టెన్ కెఎల్ రాహుల్తో పాటు ప్రభా సిమ్రాన్ను అవుట్ చేశాడు. ఇక్కడ నుంచి జట్టు మ్యాచ్ను కాపాడుకోలేకపోయింది. జట్టు 2 అంగుళాల దూరంలో.. 2 పరుగుల తేడాతో కోల్కత్తాపై పంజాబ్ ఓడిపోయింది.
వాస్తవానికి, పంజాబ్ జట్టుకు చివరి బంతికి గెలవాలంటే 7 పరుగులు చేయవలసిన పరిస్థితి. సూపర్ ఓవర్కు మ్యాచ్ వెళ్లాలంటే 6 పరుగులు అవసరం. క్రీజులో గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు.. బౌలర్ సునీల్ నరైన్. నరైన్ బంతిని ఆఫ్ స్టంప్ వైపుగా మాక్స్వెల్ బ్యాట్ మీదకు వచ్చిన బంతని సిక్సర్ కోసం కొట్టాడు.
అయితే బంతి బౌండరీకి సరిగ్గా రెండు అంగుళాల ముందు పడిపోయింది. దీంతో పంజాబ్ ఓడిపోయింది. ఈ పరాజయంతో జట్టు 100వ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు పంజాబ్ 183మ్యాచ్లు ఆడగా.. అందులో 100మ్యాచ్లు ఓడిపోయింది. ఓడిన 100మ్యాచ్లలో ఒకటి సూపర్ ఓవర్లో ఓడిపోయిన మ్యాచ్.
ఈ ఓటమితో, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపిఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా మారింది. వంద మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా పంజాబ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకుముందు, టోర్నమెంట్లో అత్యధిక ఓటముల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ కలిగి ఉంది, కానీ ఇప్పుడు ఈ ఇబ్బందికరమైన రికార్డును కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరట ఉంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 100 ఐపీఎల్ మ్యాచ్లలో ఓడిపోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 99 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఉంది, 95 ఓటములతో మూడవ స్థానంలో ఉంది ఆర్సిబి.
ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లను కోల్పోయిన జట్లు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్-100
ఢిల్లీ క్యాపిటల్స్-99
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-95