Home » PM Narendra Modi
ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనన లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాల నేపద్యంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల లోక్ సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఫ్రాన్స్ నుంచి బయలుదేరి, అబుదాబిలో ఆగిన తరువాత తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో వరదల పరిస్థితి, యమునా నది ఉధృతికి, ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
నరేంద్రమోదీ సభకు నాకు ఆహ్వానం లేదు. మోదీ ఈ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది.కేసీఆర్ పాలనలో అవినీతి జరిగిందని మోదీ అంటున్నారు..ఆరోపణలు చేయటమే కాదు దీన్ని సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.