మింత్రా లోగో మార్పుపై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. నవ్వు ఆపుకోలేరంతే?

మింత్రా లోగో మార్పుపై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. నవ్వు ఆపుకోలేరంతే?

e-commerce giant Myntra: ఈ కామర్స్ దిగ్గజం మింత్రా లోగో మార్పుపై నెటిజన్లు ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు. ఆడవారి మనోభావాలు దెబ్బతీసేలా లోగో ఉందని ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తడంతో మింత్రా తమ లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది.


దాంతో మింత్రా లోగోపై ఫన్నీ మెమీల పోస్టులతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అబ్బాయిలకు అమెజాన్ లోగో, ఫుడ్‌తో ఎలాంటి సమస్యలు లేవంటూ మెమీలను పోస్టులు చేస్తున్నారు. మా అబ్బాయిలకు మాత్రం అమెజాన్ లోగోపై ఫిర్యాదు చేయలేదంటూ ట్వీట్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోల్ చేస్తున్న మెమీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆడవారి మనోభావాలు దెబ్బతీసేలా లోగో ఉందని ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తడంతో మింత్రా తమ లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించి.. మింత్రా లోగా మార్చాల్సిందిగా పిటిషన్ వేయడంతో ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. అవెస్తా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన నాజ్ పటేల్ 2020 డిసెంబరులో ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు మింత్రా లోగోపై ఫిర్యాదు చేశారు.


మింత్రా లోగో అభ్యంతరకరమైన భంగిమలో ఉందని, మహిళలను అవమానపరిచేలా ఉందంటూ ఆమె ఆరోపించారు. వెంటనే దానిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు సదరు సంస్థ యాజమాన్యానికి నోటీసులు జారీచేయగా మింత్రా లోగోను మార్చేసింది. ముంబై పోలీస్ సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరండికార్ ఈ విషయాన్ని వెల్లడించారు. వెబ్‌సైట్‌లోనూ.. యాప్‌లో కూడా లోగోను మార్చివేస్తున్నట్టు మింత్రా ప్రకటించింది. ప్యాకేజింగ్ మెటీరియల్‌పైనా లోగోను మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.