Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?

కరోనా సమయంలో రెమిడెసివర్ మెడిసిన్ విక్రయాల్లో రెండు రాష్ట్రాల్లో పెద్దస్కాంకు పాల్పడి, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలుచేశారు.. హెటిరో పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సభ్యుడుగా వెళ్లే హక్కులేదంటూ ఘాటుగా విమర్శించారు.

Jagga reddy: మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ ఎలా ఇస్తారా?

Jagga Reddy

Jagga reddy: కరోనా సమయంలో రెమిడెసివర్ మెడిసిన్ విక్రయాల్లో రెండు రాష్ట్రాల్లో పెద్దస్కాంకు పాల్పడి, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలుచేశారు.. హెటిరో పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సభ్యుడుగా వెళ్లే హక్కులేదంటూ ఘాటుగా విమర్శించారు. కరోనా సమయంలో రెమిడెసివర్ పని చేసిందని మొదట్లో ప్రచారం జరిగిందని, రెమిడెసివర్ మెడిసిన్ రెండు రాష్ట్రాలలో పెద్ద స్కాం జరిగిందని అన్నారు.

JaggaReddy On Osmania University : ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ.. తగ్గేదేలే అంటున్న జగ్గారెడ్డి

హెటిరో పార్థసారథి ఆఫీస్ లో 500 కోట్లు ఐటీ అధికారులు పట్టుకున్నారని సమాచారం ఉందని అన్నారు. ఈ డబ్బు విజువల్స్ వచ్చాయని, కేసు ఏమైందో ఇంత వరకు చెప్పడం లేదని జగ్గారెడ్డి అన్నారు. రెమిడెసివర్ 10 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒక్కొక్క ఇంజక్షన్ లక్ష రూపాయలకు హెటిరో అమ్మిందని, ఇంత పెద్ద స్కాం చేసిన హెటిరో పార్థసారథి రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎలా పంపిస్తారంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. రెమిడెసివర్ స్కాం పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెమిడెసివర్ కు పర్మిషన్ ఇచ్చిన కేంద్రం మొదట్లో అనుమతి ఇచ్చి తర్వాత ఎందుకు వద్దని చెప్పారో తెలియాలని అన్నారు. ఫార్మా మాఫియా విచ్చలవిడి తనానికి ఇదోక ఉదాహరణ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టిక్కెట్ వెనక్కు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.