Munugode By Poll : మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? : మల్లారెడ్డి

మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? మీ ఇంట్లో మీరు తాగరా అంటూ మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి.

Munugode By Poll : మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? : మల్లారెడ్డి

Munugode By Poll Mallareddy

Munugode By Poll Mallareddy : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి ఓటర్లుకు మద్యం పోసి ప్రలోభపెడుతున్నారంటూన్నాయి ప్రతిపక్షాలు. మంత్రి మల్లారెడ్డి కొంతమంది వ్యక్తులకు మద్యం బాటిల్ పట్టుకుని పోస్తున్నట్లుగా ఉన్న ఓ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మీడియా మల్లారెడ్డిన ప్రశ్నించగా తనదైన శైలిలోనే ఆయన స్పందించారు. మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం తాగితే తప్పేంటి? అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో వారికి డిపాజిట్ కూడా రాదనే వారికి తెలుసు..అందుకే టీఆర్ఎస్ పై బురద చల్లాలనే భాగంగా నాపై విమర్శలు చేస్తున్నారని..అసలు తాగితే తప్పేంటీ వారు తాగట్లేదా? అంటూ ఎదురుదాడికి దిగారు మల్లారెడ్డి.

మద్యం బాటిల్ పట్టుకుని పోస్తున్న మంత్రి మల్లాడరెడ్డి ఫోటోతో మల్లారెడ్డితో పాటు టిఆర్ఎస్ మంత్రుల తీరును, మునుగోడు ఉపఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరతీసిన అంశాన్ని ప్రధాన ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ మంత్రి మల్లారెడ్డి మీడియాలో వైరల్ అవుతున్న తన ఫోటోపై, ప్రతిపక్షాల విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాగటం తెలంగాణ సంప్రదాయం మద్యం తాగితే తప్పేంటీ మా బంధువల ఇంటికి దావత్ కు పోయినా అక్కడ నేను వెళ్లేసరికే కొంతమంతి తాగుతున్నారు నేనుకూడా వారితో పాటు కూర్చున్నా వారికి మందు పోసా అయితే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. ఈ ఫోటోతో నాపై బురద చల్లాలునుకుంటున్నా కాంగ్రెస్,బీజేపీ నేతలు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు మల్లారెడ్డి. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండీ మీరు తాగరా? మీ ఇంట్లో తాగరా? అదేదో నేను ఒక్కడినే తాగుతున్నట్లుగా దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అంటూ మండిపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మునుగోడు ఉపఎన్నిక వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు మునుగోడు ఓటర్ల మనసును గెలుచుకోవాలని, తమకు అనుకూలంగా ఓటు బ్యాంకును మార్చుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థిని గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రచారం సాగిస్తూనే, ప్రత్యర్థి పార్టీలలో ఉన్న మైనస్ లపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న మంత్రులు ఎక్కడ దొరుకుతారా అని చూస్తున్న క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఓ మందు పార్టీలో కూర్చున్న మంత్రి మల్లారెడ్డి ఈ ఫోటోతో చిక్కారు. దీంతో మల్లారెడ్డిని ఓ రేంజ్ లో విమర్శలు సంధిస్తున్నారు.

మల్లాడరెడ్డి కొంతమందికి మద్యం పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ మునుగోడులో ప్రలోభాల పర్వానికి టిఆర్ఎస్ పార్టీ తెర తీసిందని..దీనిపై ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకు వెళ్తామని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక ఈ ఫోటోపై సమాధానం చెప్పిన మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫోటోలో ఉన్నది తానేనని, తాగితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి.మునుగోడులో ప్రచారం ముగిసిన తర్వాత బంధువుల ఇంట్లో మద్యం తాగితే తప్పా ? మనకు సన్నిహిత బంధువులకు మద్యం పోస్తే తప్పా? అంటూ మండిపడ్డారు. కావాలని ప్రత్యర్థి పార్టీలు తన ఫోటోలను వైరల్ చేస్తూ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు.