Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. మరోరోజు భారీగా కేసులు నమోదు

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 17వేల 367 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 08వేల 270 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 986కి పెరిగింది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. మరోరోజు భారీగా కేసులు నమోదు

COVID19 cases in India

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. వరుసగా రెండో రోజు 800లకు పైగా కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38వేల 122 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 836 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 443 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 52 కేసులు, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 29 కేసులు, నల్గొండ జిల్లాలో 24 కేసులు గుర్తించారు.

Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 765 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

కరోనా పుట్టినిల్లు వుహాన్‌కు WHO సైంటిస్టులు.. అసలు వైరస్ మూలం ఎక్కడో తేల్చేస్తాం!

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 17వేల 367 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 08వేల 270 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 986కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 36వేల 764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 852 మందికి పాజిటివ్ గా తేలింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.