పెళ్లి పందిరిలోకి వచ్చి వరుడి ప్రియురాలు హల్చల్.. యాసిడ్, కత్తితో దాడి
బాషా తనతో ప్రేమాయణం కొనసాగించి, ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని..
![పెళ్లి పందిరిలోకి వచ్చి వరుడి ప్రియురాలు హల్చల్.. యాసిడ్, కత్తితో దాడి పెళ్లి పందిరిలోకి వచ్చి వరుడి ప్రియురాలు హల్చల్.. యాసిడ్, కత్తితో దాడి](https://10tv.in/wp-content/uploads/2024/08/First-Wife-stopped-Over-Second-Marriage-of-Husband.jpg)
తనను ప్రేమించి మరో అమ్మాయిని వివాహమాడుతున్నాడంటూ పెళ్లి పందిరిలో ఓ యువతి హల్చల్ చేసింది. తనతో పాటు కత్తి, యాసిడ్ తెచ్చుకుని పెండ్లి కొడుకుపై దాడికి దిగింది. అన్నమయ్య జిల్లాలోని నందలూరు మండలం అరవపల్లిలో ఓ పెళ్లి మండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న నందలూరు పోలీసులు పెళ్లి కొడుకు సయ్యద్ బాషా, అతడి ప్రియురాలు జయను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాషా తనతో ప్రేమాయణం కొనసాగించి, ఇప్పుడు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని జయ తెలిపింది. బాషాకు స్వల్ప గాయాలయ్యాయి.
అతడిపై పెళ్లి పందిరిలో యువతి దాడి చేయడంతో పెళ్లి రద్దు అయింది. పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు. పెళ్లి కూతురు ఏపీకి చెందిన యువతి. ఆమెకు రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషాతో పెద్దలు ఇవాళ వివాహం నిశ్చయించారు.
సయ్యద్ బాషా ఇంతకుముందే తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా, పెళ్లి పందిరిలో జయ చేసిన రచ్చతో యాసిడ్ పడి ఒక మహిళలకు తీవ్రం గాయాలుకాగా, మరో మహిళలు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: రైలు ఢీ కొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి