AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరోసారి భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. 4వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 35వేల 732 శాంపుల్స్ పరీక్షించగా 4వేల 157మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా మరణాలూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 18మంది చనిపోయారు.
నెల్లూరు జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, విశాఖలో ఇద్దరు…అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,606 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 617 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 522, చిత్తూరు జిల్లాలో 517 కేసులు, గుంటూరులో 434, కర్నూలులో 386 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు : 9,34,154
కోలుకున్న వారు : 8,98,432
కరోనా మరణాలు : 7,339
యాక్టివ్ కేసులు : 25,383
#COVIDUpdates: 14/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,34,154 పాజిటివ్ కేసు లకు గాను
*8,98,432 మంది డిశ్చార్జ్ కాగా
*7,339 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 28,383#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/BJqveswThb— ArogyaAndhra (@ArogyaAndhra) April 14, 2021