అరకులో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్ వాసులు ?

అరకులో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్ వాసులు ?

Araku in Andhra : విశాఖ పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద టూరిస్టులతో వెళుతున్న దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ పేట వారిగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, 108 సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిని వారిని ఎస్.కోటలోని ఆసుపత్రికి తరలించారు.

అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారిలో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న వారందరికీ గాయాలయ్యాయి. గాయాలతో చిన్నారులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే…ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియరావడం లేదు. దినేష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు పూర్తిగా కండీషన్ లో ఉందా ? డ్రైవింగ్ లో డ్రైవర్ కు నైపుణ్యం ఉందా ? అనేది తెలియరావడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.