YSR పెన్షన్ కానుక : ప్రభుత్వం మాట తప్పుతోందా ? మోసం చేస్తోందా – పవన్

వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు జనసేనానీ. ఇప్పటికే పలు ప్రదర్శనలు, ర్యాలీలు, దీక్ష చేసిన పవన్..ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. YSR పెన్షన్ కానుకలో జగన్ ప్రభుత్వం మాట తప్పుతోందని అనాలా ? లేక మోసం చేస్తోందా అనుకోవాలా అంటూ ప్రశ్నించారు జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
అధికారంలోకి రాకముందు : –
వైసీపీ ఎన్నికల హామీ – వృద్ధాప్య పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు పెంచుతాం.
వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం.
Read More : వెనక్కి నడిచిన బాబు..టీడీపీ నేతలు : రివర్స్ టెండరింగ్పై టీడీపీ నిరసన
అధికారంలోకి వచ్చాక : –
* పెన్షన్ రూ. 3 వేలు చేయలేదు. రూ. 2 వేల 250 మాత్రమే చేశారు. ఒక్కో ఫించన్ లబ్దిదారుడు రూ. 750 నష్టపోతున్నారు.
* పెన్షన్ పొందే..వయస్సు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని మే 30వ తేదీన ఇచ్చిన జీవో ఎం.ఎస్ నెంబర్ 103 ద్వారా చెప్పారు.
* ఈ విధంగా తగ్గించడం వల్ల దాదాపు కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాలి.
* కానీ ఈ రోజు వరకు ఒక్క కొత్త ఫించన్ లబ్దిదారుడికీ ఒక్క రూపాయి దక్కలేదు.
* వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 వేల 250 లెక్కనే చూసుకున్నా..ఒక్కో కొత్త ఫించన్ లబ్దిదారు కుటుంబం ఈ 7 నెలల్లో రూ. 15 వేల 700 కోల్పోయింది.
* ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య ఫించన్ లబ్దిదారు కుటుంబం ఈ 7 నెలల్లో కోల్పోయింది అక్షరాల రూ. 15 వేల 700’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
మరి ఈ ట్వీట్పై వైసీపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
G.O on Old age Pension Scheme pic.twitter.com/P1twd5vMMu
— Pawan Kalyan (@PawanKalyan) December 16, 2019
వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ అమలులో వైసీపీ ప్రభుత్వం అంచలంచెలుగా మాట తప్పుతోంది అనాలా? లేక మోసం చేస్తోంది అనుకోవాలా? pic.twitter.com/kdsAws7stK