Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట..

ఈ కేసుకి సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు.

Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట..

Updated On : March 6, 2025 / 5:14 PM IST

Posani Krishna Murali : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులకు సంబంధించి క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని.

ఆదోని పోలీసులు అరెస్ట్ చేసిన కారణంగా పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అదే విధంగా విశాఖపట్నం పోలీసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని పీపీ కోరారు. ఈ కేసుకి సంబంధించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Also Read : దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం పాతపట్నం, అనంతపురంలో నమోదైన కేసులకు సంబంధించి విచారణను వాయిదా వేసింది కోర్టు. మొత్తంగా రెండు కేసులకు సంబంధించి పోసానికి కొంత ఊరట లభించింది. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా మరో 13 కేసులు ఉన్నాయి. తాను ఏదీ తప్పుగా మాట్లాడలేదని, సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్తావించానని, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి కోర్టుని అభ్యర్థించారు.

 

తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశారు పోసాని. తనపై ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని, తదుపరి చర్యలను నిలువరించాలని కోరారు.

Also Read : మొన్న వంశీ.. నిన్న పోసాని.. వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ రజినిదేనా? ఏసీబీ కేసులో బిగుస్తున్న ఉచ్చు..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించారంటూ పోసానిపై రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటిని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. తనపై రాజకీయ ద్వేషంతోనే తప్పుడు కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్న పోసాని.. ఆయా కేసుల్లో 41ఏ నోటీసులు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.