పిచ్చిపిచ్చిగా వాగితే నాలుక కోస్తాం.. వైసీపీ నేతలపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.

పిచ్చిపిచ్చిగా వాగితే నాలుక కోస్తాం.. వైసీపీ నేతలపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Buddha Venkanna

Buddha Venkanna : టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు పుంగనూరువస్తే ఆయన‌పై దాడులు చేయించారు. దమ్ముగా, ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజల‌కోసం‌ పనిచేసే మా నాయకుడికి భయం లేదు. దోచుకున్న మీకు భయం కాబట్టే… పారిపోతున్నారు. నిన్న మిమ్మలను అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్ల దాడి‌ చేయించాడు. జగన్ కు, నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకు. పెద్దిరెడ్డి కుటుంబానికి దోచుకోమని మైనింగ్ అప్పగించాడు. దొంగ చేతికి తాళ్లం ఇచ్చారు కాబట్టే ప్రజల సంపద దోచేశారు. పెద్దిరెడ్డి వేల కోట్లు అక్రమంగా దోచేశాడని బుద్దా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Also Read : భారీ వర్షాలకు సముద్రంలో అల్లకల్లోలం.. స్కూల్స్‌కు సెలవు ప్రకటించిన కలెక్టర్

అధికారం, ధన ప్రభావంతో గతలో విర్రవీగారు.. మీ అరాచకాలు చూడలేకే ప్రజలు తిరగ పడుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. డబ్బు మదంతో అబ్బాకొడుకులు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఓడించడానికి డబ్బులు వెదజల్లారు. అయినా ప్రజలు అబ్బాకొడుకుల కుట్రను తిప్పి కొట్టారని బుద్దా తెలిపారు. నిన్న మిథున్ రెడ్టి చేసిన నిర్వాకం ప్రజలు చూశారు. మీ‌ వైసీపీ కార్యకర్తలే నీకు అండగా నిలవలేదు. అబ్బాకొడుకుల అవినీతితో ఆ పార్టీ వాళ్లే ఆశ్చర్యపోయారు. మీ నియోజకవర్గం లో ప్రజలే మిమ్మపను ఛీ కొడుతున్నారు. వెయ్యి తరాలు తిన్నా.. తరగని సంపద పెద్దిరెడ్డి గడిచిన ఐదేళ్లలో దోచుకున్నాడు. నిన్న పుంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని‌ ఛీ కొట్టారు. ఇప్పటికైన మీ చేతుల్లో ఉన్న మైనింగ్ గనుల ప్రజలకు అప్పగించండని బుద్దా హెచ్చరించాడు.

Also Read : బీజేపీలోకి వైసీపీ ముఖ్య నేత బుగ్గన? ఆ భయంతోనే పార్టీ మారనున్నారా?

చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మా నాయకుడు సంయమనంతో ఉండాలని‌ చెప్పారు. కాబట్టి సైలెంట్ గా ఉన్నాం. లోకేశ్ రెడ్ బుక్ పేరు‌ చెబితేనే భయ పడుతున్నారు. ఆ బుక్ లో ‌పేర్లు ప్రకటిస్తే ..‌ఇక మీ పరిస్థితి ఏమిటి. ఇప్పుడు అయినా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకో అని బుద్దా వెంకన్న సూచించారు. కొడాలి నాని ఒక వెధవ.. వాడు లాక్కున్న థియేటర్ అసలు యజమానులకు అప్పగించారు. ఇది రావణ కాష్టం ఎలా అవుతుందో నాని చెప్పాలని బుద్దా ప్రశ్నించారు. ఇది రామరాజ్యం.. మీరు గత ఐదేళ్లు నడిపింది రావణ కాష్టం. మీరు పిచ్చిపిచ్చిగా వాగితే నాలుక కోస్తాం. ప్రజలు కొట్టిన దెబ్బకు వైసీపీ నాయకులకు మతి భ్రమించిందని బుద్దా వెంకన్న అన్నారు.