కొండచిలువను చంపితే జైలుకే

వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని..శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ గుండాల హెచ్చరించారు. జాతీయ జంతువు పెద్దపులిని చంపినా... కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష అని స్పష్టం చేశారు.

కొండచిలువను చంపితే జైలుకే

వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని..శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ గుండాల హెచ్చరించారు. జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష అని స్పష్టం చేశారు.

వణ్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని..శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ గుండాల హెచ్చరించారు. జాతీయ జంతువు పెద్దపులిని చంపినా… కొండ చిలువను చంపినా.. ఒకే రకమైన శిక్ష అని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల కొండ చిలువలను హతం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కూడా చట్టం ప్రకారం నేరంగానే పరిగణిస్తామన్నారు.

వణ్యప్రాణి సంరక్షణ చట్టం (1972) ప్రకారం షెడ్యూల్‌-1 కేటగిరీలో పెద్దపులి, నెమలి, జింక, ఫిషింగ్‌ క్యాట్, కొండ గొర్రె, ఏనుగు, చిరుత పులి, ఎలుగు బంటి తదితర జంతువులతోపాటు కొండ చిలువలను చంపితే చట్ట ప్రకారం ఏడాది నుంచి ఆరేళ్ల వరకు కఠిన జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధిస్తామని తెలిపారు. జిల్లాలో 15 రోజుల్లోనే లావేరు, బూర్జ, గార, నందిగాం, పలాస, ఆమదాలవలస తదితర మండలాలతోపాటు ఏజెన్సీ మండలాల్లోనూ పది వరకు కొండచిలువలను చంపేసినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయని… ఇది నిజంగా దారుణమన్నారు. కొండచిలువలు ఎక్కడైనా తారసపడితే.. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

జిల్లాలో వణ్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లో భాగంగా అన్ని మండలాల్లోనూ సచివాలయాలతోపాటు పలు ప్రభుత్వ భవనాల దగ్గర స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతామని డీఎఫ్‌వో సందీప్‌ కృపాకర్‌ తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ శాఖ చట్టంపై అవగాహన కలిగించేలా తమ అధికార బృందంతో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు.

అలాగే ఇదే చట్టం ప్రకారం షెడ్యూల్‌-3లో అడవి పందిని చంపినా కచ్చితంగా నేరంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటీవల పొందూరు మండలంలో ఓ కేసును నమోదు చేసినట్లు గుర్తు చేశారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కూడా చట్టాలపై పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. వణ్యప్రాణులను చంపిన వారిపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా, వెంటనే అప్రమత్తమై, క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గుర్తించి, నిందితులపై కేసులను నమోదు చేయాలని ఆదేశించారు.