ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి.. పథకాన్ని నీరుగార్చాలని చూస్తే ఊరుకోం : వైఎస్ షర్మిల

ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

YS Sharmila

YS Sharmila : ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ ఖాతా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా..? ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా..? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు.

Also Read : పవన్ కళ్యాణ్‌తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స‌న్ భేటీ ..

పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు. బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా అంటూ షర్మిల ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా. గత YCP ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే.. ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

Also Read : MPDO Venkata Ramana Case : నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సైబర్ నేరగాళ్లకోసం పోలీసుల వేట..

ఆరోగ్యశ్రీ పథకం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం. పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించమని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు