Mahashivratri 2025 : మహాశివరాత్రి రోజు శివలింగానికి జలాభిషేకం ఎలా చేయాలి? నియమాలేంటి? ఎలా పూజిస్తే ఐశ్యర్యం కలుగుతుంది?
Mahashivratri 2025 : మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల అదృష్టం, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. శివ పురాణం ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించే నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- Sreehari A
- Published On : February 18, 2025 / 10:03 PM IST
Mahashivratri 2025: Date timings rituals
Mahashivratri 2025 : మహాశివరాత్రి రోజున భక్తులు శివుని అనుగ్రహం పొందాలంటే కఠినమైన ఆచారాలను పాటించాలి. ఈ ఆచారాలలో ఎక్కువగా ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదంటే ప్రసిద్ధ శివుని ఆలయాలలో లేదా ఇంటికి సమీపంలోని దేవాలయాలలో చేయొచ్చు. భక్తులు సూర్యోదయానికి ముందే ఉదయాన్నే నిద్రలేచి గంగాజలం, నీటితో స్నానం చేసి, ఆపై ఇంటి ఆలయాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి.
Read Also : Astrology Tips : రుద్రాక్ష ధరించే ముందు గుర్తుంచుకోవాల్సిన 9 విషయాలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?
ఈ రోజున తెలుపు లేదా కుంకుమ రంగు దుస్తులను ధరిస్తారు. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు. చాలామంది శివాలయాలను సందర్శించి శివలింగానికి నీరు, పాలు, బిల్వ ఆకులు అర్పిస్తారు. రుద్రాభిషేక పూజలో కూడా పాల్గొంటారు. ఇక్కడ శివుడిని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన పంచామృతంతో పూజిస్తారు. ‘ఓం నమః శివాయ్’ అని జపిస్తారు.
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి :
ఈ నెల 26న కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ సంవత్సరంలో మహాశివరాత్రి బుధవారం రోజు వస్తుంది. ఈ రోజున శివుడిని, పార్వతిని పూజిస్తారు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం కలుగుతుంది. కోరిక కోరికలు నెరవేరుతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందని మత విశ్వాసం. పురాణాల ప్రకారం, శివుడు, తల్లి పార్వతి మహాశివరాత్రి రోజున వివాహం చేసుకున్నారు.
ఈ రోజున చాలా మంది భక్తులు శివునికి జలభిషేకం చేస్తారు. మహాశివరాత్రి నాడు శివలింగానికి జలం సమర్పించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివ పురాణం ప్రకారం.. శివలింగంపై నీటిని సమర్పించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు.
అదే సమయంలో, చాలాసార్లు జలభిషేకం చేసేటప్పుడు తెలిసి లేదా తెలియకుండానే తప్పులు చేస్తుంటాం. మహాశివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేసే సరైన పద్ధతి, నియమాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.
శివలింగానికి నీటిని ఎలా సమర్పించాలి? నియమాలేంటి? :
- శివుడికి జలాన్ని సమర్పించడానికి రాగి, వెండి లేదా గాజు పాత్ర తీసుకోండి.
- శివలింగానికి జలాభిషేకం ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే చేయాలి.
- ఉత్తర దిశను శివుని ఎడమ వైపుగా పరిగణిస్తారు. ఇది తల్లి పార్వతికి అంకితం.
- ముందుగా, గణేశుడు ఉండే శివలింగ జలధారికి కుడి వైపున నీటిని సమర్పించాలి.
- ఇప్పుడు కార్తికేయ స్వామి స్థలమైన శివలింగ జలధారి ఎడమ వైపున నీటిని సమర్పించండి.
- ఆ తరువాత, కుమార్తె అశోక్ సుందరికి అంకితమైన శివలింగ జలధారి మధ్యలో నీటిని సమర్పించాలి.
- ఇప్పుడు పార్వతి దేవి స్థలంగా చెప్పే శివలింగం చుట్టూ నీటిని సమర్పించండి.
- చివరగా, శివలింగం పైభాగంలో నీటిని సమర్పించండి.
