Gold And Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది.

Gold And Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Updated On : May 13, 2025 / 10:03 AM IST

దేశంలో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.150పెరిగి, రూ.87,650గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.160 పెరిగి, రూ.95,620గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.71,720గా ఉంది.

Also Read: యువకుడి అసూయ, డెడ్లీ రివేంజ్‌.. తాను ఇష్టపడిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని.. ఆమె భర్తను అతి దారుణంగా..

ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.87,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.95,770గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి 71,840గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.150పెరిగి, రూ.87,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.160 పెరిగి, రూ.95,620గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగి రూ.71,720గా ఉంది.

వెండి ధరలు
భారత్‌లో వెండి ధరల్లో ఇవాళ ఉదయం రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.97,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి రూ.97,900గా ఉంది