Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold

Updated On : November 1, 2023 / 8:21 AM IST

Today Gold and Silver Rate : భారత్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరుగుతోంది. వరుస పండుగల నేపథ్యంలో మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో బంగారం కొనుగోలుకు వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి. అయితే, గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారంసైతం బంగారం ధర భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం .. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 తగగ్గా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 550 తగ్గింది. వెండిధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లోనూ వరుసగా రెండోరోజు బంగారం ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,700 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,850కు చేరుకుంది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 62,000కి చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 కు చేరింది.
– చెన్నైలో బంగారం ధరల్లో స్వల్పంగా తగ్గుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 200 తగ్గగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 210 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,150కి తగ్గగా, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,350 వద్దకు చేరింది.

తగ్గిన వెండి ధర..
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 300 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,200కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,200. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.75,300 వద్దకు చేరింది. బెంగళూరులో మాత్రం వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో అక్కడ కిలో వెండి రూ.74,000 వద్ద కొనసాగుతుంది.