Gold And Silver Price : బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్.. బుధవారం గోల్డ్ ధర భారీగా పెరిగింది. తులం బంగారంపై రూ. 250 పెరిగింది. దీంతో గడిచిన వారం రోజుల్లో గోల్డ్ ధర సుమారు రూ. 800 పెరిగింది. మరోవైపు వెండిధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,740 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,890.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,600 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,740.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,100 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,380 గా నమోదైంది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర పెరిగింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,200 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,200కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.75,700కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.