Gold and Silver Price Today : లోక్ సభలో కేంద్రం బడ్జెట్ విడుదల చేసిన తరువాత భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బుధవారం బ్రేక్ పడింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్లపై బంగారంపై రూ. 800 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. తాజాగా ధరల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,000 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.69,820.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.64,150 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 69,970.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.64,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 69,820.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,090 కు చేరింది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 91,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 86,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500.
బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.