Gold Price Today : కొత్తేడాదిలో పరుగు మొదలెట్టిన బంగారం ధర.. తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold
Gold And Silver Prices Today : 2024 సంవత్సరంలో బంగారం ధర పరుగు మొదలు పెట్టింది. 2023లో భారీగా పెరుగుదలను నమోదు చేసుకున్న బంగారం ధర.. 2024లోనూ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది తొలిసారి బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. 300 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,750కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 64,090 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 64,240.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 మార్క్ తాకింది.
– చెన్నైలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.59,200కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.64,580గా నమోదైంది.
వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,300 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,300. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,900కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,500 వద్ద కొనసాగుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.