సామాన్య ప్రజలు, రైతులకు గుడ్న్యూస్.. వీటి ధరలు తగ్గనున్నాయ్.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక సంస్కరణలకు ఆమోదం
ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని సీతారామన్ అన్నారు.

FM Nirmala Sitharaman Says I Speak Hindi With Lot Of Hesitation and The Language Gives Me Shivers
GST Council Meeting: ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక సంస్కరణలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
5, 18 శాతం స్లాబ్లను కొనసాగించి, 12, 28 శాతం స్లాబ్లు తొలగిస్తారు. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను పడుతుంది. ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని అని సీతారామన్ అన్నారు. కౌన్సిల్ సెప్టెంబర్ 4న మళ్లీ సమావేశమవుతుంది.
Also Read: 20,000 కి.మీ. రేంజ్ ఉన్న అణు క్షిపణిని ప్రదర్శించిన చైనా.. అమెరికా గుండె గుభేల్!
కీలక నిర్ణయాలు ఇవే..
- “సిన్ గూడ్స్” (సోడాలు, 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదు చేసే లగ్జరీ కార్లు)పై 40 శాతం పన్ను
- పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, చక్కెర కలిపిన గ్యాస్ పానీయాలపై 40 శాతం పన్ను
- అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ మినహాయింపు (GST Council Meeting)
28% నుంచి 18%కి తగ్గిన వస్తువులు ఇవే
- సిమెంట్
- 300 సీసీలలోపు చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు
- బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు
- అన్ని ఆటోపార్ట్స్ పై 18 శాతం రేటు
- ఆటోరిక్షాలు
18% స్లాబ్లోకి వచ్చిన వస్తువులు ఇవే
- ఎయిర్ కండిషనింగ్ యంత్రాలు, అన్ని టెలివిజన్లు, డిష్ వాషింగ్ యంత్రాలు, చిన్న కార్లు, 300 సీసీలలోపు మోటార్ సైకిళ్లు
- 18% నుంచి 5%కి తగ్గిన వస్తువులు
- నమ్కీన్, భుజియా, సాస్, పాస్తా, ఇన్స్టంట్ నూడుల్స్, చాక్లెట్, కాఫీ, ప్రిజర్వ్డ్ మాంసం, వెన్న, నెయ్యి
5% కన్నా తక్కువ
- అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పనీర్, రోటీ, పరాటా
12%, 18% నుంచి 5%కి తగ్గినవి ఇవే
హెయిర్ ఆయిల్, సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టేబుల్ వేర్, కిచెన్ వేర్, నూడుల్స్, పాస్తా, ఆహార పదార్థాలు, రొటీలు, సైకిళ్లు, పలు ఔషధాలు, మెడికల్ పరికరాలు, వ్యవసాయ పరికరాలు.