PM Kisan Scheme
PM Kisan 21st Installment Date : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో ప్రధానమంత్రి కిసాన్ యోజన 21వ విడత 2025 విడుదల కానుంది. ఇప్పటివరకూ 20 వాయిదాలు అందుకున్న రైతులు 21వ వాయిదా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
అందిన సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్ 21వ విడత రూ. 2వేలు వచ్చే అక్టోబర్ లేదా నవంబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే.. దీపావళికి ముందుగానే నరేంద్ర మోదీ ఈ 21వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది.
అయితే, ఇప్పటివరకూ దీనిపై కేంద్ర ప్రభుత్వం (PM Kisan 21st Installment Date) కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. సాధారణంగా ఈ పీఎం కిసాన్ పథకం కింద వాయిదాలు దాదాపు ప్రతి 4 నెలల తర్వాత విడుదల అవుతాయి. ఈ ఏడాదిలో ఆగస్టు 2న పీఎం కిసాన్ 20వ విడత రైతుల ఖాతాలకు జమ అయింది. దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు దాదాపు రూ. 20,500 కోట్ల ప్రత్యక్ష ఆర్థిక సాయాన్ని పొందారు.
పీఎం కిసాన్ అంటే ఏంటి? :
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) అధికారికంగా పీఎం కిసాన్ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును అందించడమే ఈ పథకం ఉద్దేశం. భారత ప్రభుత్వం డిసెంబర్ 2019లో ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద అర్హత కలిగిన రైతులు సంవత్సరానికి రూ. 6,000 అందుకుంటారు.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా ప్రతి 4 నెలలకు 3 సమాన వాయిదాలలో రూ. 2,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల అవుతుంది. ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 120 మిలియన్ల మంది రైతులకు అందుబాటులో ఉంది. PIB డేటా ప్రకారం.. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ. 3.69 లక్షల కోట్లకుపైగా రైతుల ఖాతాలకు బదిలీ అయింది.
రైతులు 21వ వాయిదా కోసం ఇలా చేయండి :
పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
పేజీలో లబ్ధిదారుడి వివరాలను ఇలా చెక్ చేయండి :
రైతు పేరు, తండ్రి/భర్త పేరు రాష్ట్రం, జిల్లా, గ్రామం పేమెంట్ స్టేటస్, వాయిదా వివరాలు ఆధార్ ధృవీకరణ స్టేటస్ వంటివి చెక్ చేయాలి.
ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ పేమెంట్ స్టేటస్ త్వరగా ట్రాక్ చేయొచ్చు. ఏదైనా తప్పులు ఉంటే రైతులు స్థానిక అధికారులను సంప్రదించాలి. పీఎం కిసాన్ పోర్టల్లోని హెల్ప్లైన్ నంబర్ల ద్వారా సంప్రదించాలి.