వీడిన హత్యల మిస్టరీ : మటన్ సూప్ లో సైనెడ్ కలిపి.. 14ఏళ్లుగా కుటుంబంలో ఒక్కొక్కరిని చంపేసింది
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల

కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. పోస్టుమార్టం నివేదిక మర్డర్ మిస్టరీని చేధించింది. ఆస్తి కోసం కుటుంబసభ్యులను చంపేసింది. 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరిని మర్డర్ చేస్తూ వచ్చింది. మటన్ సూప్ లో సైనెడ్ కలిపి వారందరిని కడతేర్చింది.
వివరాల్లోకి వెళితే.. కోజికోడ్ జిల్లా కూడథాయ్ గ్రామంలో ఓ క్యాథలిక్ ఫ్యామిలీలో ఆరుగురు హత్యకు గురయ్యారు. 2002 నుంచి 2016 వరకు కుటుంబంలోని ఒక్కొక్కరు చనిపోయారు. ఆస్తి కోసం జాలీజోసెఫ్(47) కుటుంబసభ్యులను హతమార్చింది. భర్త సోదరుడు షాజుపై మనసు పడిన ఆమె.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆస్తి మీద కన్నేసిన జాలీ.. షాజు సాయంతో కుటుంబసభ్యలను పక్కా స్కెచ్ ప్రకారం మర్డర్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరిని చంపుతూ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
2002లో అత్త అన్నమ్మ థామస్(57), 2008లో మామ టామ్ థామస్(66) చనిపోయారు. 2011లో భర్త రాయ్ థామస్(40) ను సైతం హత్య చేసింది జాలీ. 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ(67) చనిపోయారు. 2016లో అల్ఫోన్సా(2), ఆ తర్వాత ఆమె తల్లి సిలీ(27) చనిపోయారు. వారందరివి సహజ మరణాలే అని జాలీ జోసెఫ్ .. కుటుంబసభ్యులను, స్థానికులను నమ్మించింది. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా డీల్ చేసింది. అందరి మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా స్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టింది.
అయితే దీనిపై థామస్ సమీప బంధువు చార్లెస్ కి అనుమానం వచ్చింది. 14 ఏళ్ల వ్యవధిలో కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడంపై సందేహం కలిగింది. ఏదో జరిగిందని డౌట్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం పోలసులను విస్మయానికి గురి చేసింది. 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం వారికి కూడా అనుమానాస్పదంగా అనిపించింది. పోలీసులు మృతదేహాలను తిరిగి బయటికి తీయించారు. వాటిని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజం బయటపడింది. వారిది సహజ మరణం కాదు.. మర్డర్ అని తేలింది. అందరికి సైనెడ్ ఇచ్చి చంపేశారని తేలింది. పోస్టుమార్టం నివేదిక చూసి పోలీసులు షాక్ అయ్యారు. జాలీ జోసెఫ్, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించారు. దీంతో వారు నేరాన్ని అంగీకరించారు. ఆస్తి కోసం తామే మటన్ సూస్ లో సైనెడ్ ఇచ్చి చంపేశామని ఒప్పుకున్నారు.
అందరిని చంపేశాక జాలీ థామస్.. షాజుని పెళ్లి చేసుకుంది. మామ టామ్ పేరు మీదున్న ఆస్తిని తన పేరున రాయించుకుంది. టామ్ చిన్న తమ్ముడి కొడుకు మోజో.. దీనిపై కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీరియల్ మరణాల అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూశాయి. ఆ ఆరుగురివి హత్యలు అని తెలిసి యావత్ రాష్ట్ర ప్రజలు షాక్ కి గురయ్యారు. ఆస్తి కోసం ఓ మహిళ ఇంత దారుణానికి ఒడిగట్టిందా అని తెలిసి విస్తుపోయారు. జాలీ థామస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పాలిగ్రాఫ్ టెస్ట్ కి రావాలని కోరారు. అయితే జాలీ అందుకు ఒప్పుకోలేదు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి తప్పించుకుంది. దీంతో పోలీసులకు అనుమానాలు పెరిగాయి. లోతుగా విచారణ మొదలుపెట్టారు. జాలీ కాల్ లిస్ట్ ని చెక్ చేశారు. ఎక్కువసార్లు షాజుతో మాట్లాడినట్టు గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేయగా.. శరీరంలో సైనెడ్ శేషాలు ఉన్నట్టు నిర్ధారించారు.