Road Accident : ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రమాదానికి కారణమైన కారు ప్రముఖ సినీ నటుడిదిగా పోలీసులు గుర్తించారు.

Road Accident : ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

Actor Raghubabu Car Incident

Road Accident : నల్గొండ జిల్లా అద్దంకి నార్కట్ పల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు(48) మృతి చెందారు. రిక్షా పుల్లర్స్ కాలనీ సమీపంలో బైక్ ను కారు ఢీకొంది. ప్రమాదానికి కారణమైన కారు ప్రముఖ సినీ నటుడు రఘుబాబుదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో రఘుబాబు కారులోనే ఉన్నారు. ఈ యాక్సిడెంట్ లో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ అనంతరం రఘుబాబు మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పాట్ లోనే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. జనార్దన్ రావు బైక్ పై నల్గొండ నుంచి వచ్చారు. స్థానికంగా ఉన్న వెంచర్ లో ఆయన ఒక పార్టనర్ గా ఉన్నారు. ఆ వెంచర్ కు ఆయన సాయంత్రం వేళ తరుచుగా వస్తుంటారు. అక్కడ డివైడర్ ఉంటుంది. యూటర్న్ తీసుకునే క్రమంలో అనుకోకుండా వెనుక నుంచి వేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు జనార్దన్ రావు బైకుని ఢీకొట్టింది. బైక్ పై ఉన్న జనార్ధన్ రావు స్పాట్ లోనే మరణించారు. బైక్ కారు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. బైక్ పై ఉన్న జనార్ధన్ రావు ఎగిరిపడ్డారు. ఆ వెంటనే చనిపోయారు.

యూటర్న్ తీసుకునే క్రమంలో సిగ్నల్ ఇవ్వలేదని రఘుబాబు కారు డ్రైవర్ తెలిపారు. స్థానికులు కూడా ఇదే విషయం చెప్పారు. ఒక్కసారిగా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేయడం, హైవైపే వేగంగా వస్తున్న బీఎండబ్లూ కారు కావడం వేగంగా వచ్చి ఢీకొందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సజ్జల భూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వచ్చాయి. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని రఘుబాబు చెప్పారు.

Also Read : గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆయిల్ ట్యాంక‌ర్‌ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మ‌ర‌ణం