విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం : ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు
విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్

విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్
విశాఖ రైల్వేస్టేషన్లో కలకలం చేలరేగింది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో రావడం, తనిఖీలు చేయడం చూసి షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ మీదుగా వెళ్తున్న యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్లో బంగ్లాదేశ్కి చెందిన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ప్రయాణిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు.
పెద్ద సంఖ్యలో పోలీసులను రైల్వేస్టేషన్ దగ్గర మోహరించారు. హౌరా ఎక్స్ప్రెస్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బంగ్లాదేశ్కు చెందిన నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా బెంగళూరు నుంచి ఖరగ్పూర్ వెళ్తున్నట్లు నిర్ధారించారు. వారికి బంగ్లాదేశీ మొహిద్దీన్తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే అంతమంది పోలీసులు ఒక్కసారిగా రైల్వేస్టేషన్లోకి రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. రైల్వే స్టేషన్ను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికుల్లో కలకలం రేగింది. పోలీసులు స్టేషన్లోకి ప్రవేశించి ట్రైన్ మొత్తం క్షుణ్ణంగా వెతకడం ప్రారంభించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముమ్మర తనిఖీల తర్వాత ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.