Malakpet Sirisha Case : శిరీష కేసులో బిగ్ ట్విస్ట్.. చంపింది అతడు కాదు ఆమె.. హత్యకు అసలు కారణమిదే..
భార్యను హత్య చేసిన విషయం తెలిసినా.. అక్క సరితను ఏమీ అనలేదు వినయ్ కుమార్. తన మరో అక్క కొడుకు నిహాల్ సాయంతో..

Sirisha Death Case
Malakpet Sirisha Case : హైదరాబాద్ మలక్ పేట్ శిరీష కేసులో పోలీసులు సంచలన విషయాలు తెలియజేశారు. శిరీష హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. శిరీషను చంపింది భర్త కాదు.. భర్త సోదరి సరిత అని తేల్చారు. భర్త వినయ్ సోదరి సరితతో జరిగిన గొడవే శిరీష హత్యకు కారణం అని మలక్ పేట్ ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు.
ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భావించిన సరిత.. మత్తుమందు డోస్ పెంచి ఇచ్చిందన్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చాక అపస్మారక స్థితిలోకి వెళ్ళిన శిరీష ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందన్నారు. ఈ కేసు నిందితులు సరిత, వినయ్, నిహాల్ ను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. కేసు వివరాలను ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు.
”శిరీష మృతిపై ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిరీష మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దోమలపెంట తరలిస్తున్న సమయంలో ఆమన్ గల్ వద్ద వినయ్ కుమార్ కి కాల్ చేసి.. అంబులెన్స్ ను వెనక్కి రప్పించాం. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారించాం.
Also Read : వామ్మో.. ఆ నటి దుస్తుల్లో 15 కేజీల బంగారం.. అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే..
పోస్టుమార్టం రిపోర్టులో.. గొంతు నులిమి శిరీషను చంపినట్లు ఉంది. శిరీష భర్త వినయ్ కుమార్, అతడి అక్క సరిత, వినయ్ మరో అక్క కొడుకు నిహాల్ ను అదుపులోకి తీసుకుని విచారించాం. శిరీషను తానే హత్య చేసినట్లు సరిత ఒప్పుకుంది. సరిత, శిరీష ఇద్దరూ సన్ రైజ్ హాస్పిటల్ లో పరిచయం అయ్యారు. శిరీష అనాధ అవడంతో.. తన తమ్ముడు వినయ్ తో పెళ్ళి సంబంధం సెట్ చేసింది.
నర్స్ ట్రైనింగ్ చేసిన శిరీష సన్ రైజ్ లో మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ హాస్పిటల్ లో చేరింది. ఆ తర్వాత వివేర హాస్పిటల్ లో చేరింది. కొన్ని నెలల తర్వాత అక్కడ కూడా మానేసింది. దీనిపై శిరీష, సరిత మధ్య గొడవ జరిగింది. ఒక్కచోట కూడా కుదురుగా పని చేయవు అని శిరీషతో గొడవ పడింది సరిత. ఈ క్రమంలో నీ చరిత్ర, నీ వివాహేతర సంబంధాలన్నీ నాకు తెలుసు. అందరికీ చెప్తాను అని సరితను బెదిరించింది శిరీష. మరుసటి రోజు శిరీష వెళ్ళి సరితకు సారీ చెప్పింది.
సరితకు మత్తుమందు వేసుకునే అలవాటు ఉంది. తనకు నిద్ర పట్టడం లేదని, మత్తుమందు కొంచెం ఇవ్వమని సరితను అడిగింది శిరీష. ఎప్పటికైనా శిరీష తన చరిత్ర అంతా బయటపెట్టే అవకాశం ఉందని భయపడిన సరిత.. మత్తుమందు డోస్ పెంచి ఇచ్చింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిన శిరీష ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
ఈ విషయం వినయ్ కుమార్ కి చెప్పింది. భార్యను హత్య చేసిన విషయం తెలిసినా.. అక్క సరితను ఏమీ అనలేదు వినయ్ కుమార్. తన మరో అక్క కొడుకు నిహాల్ సాయంతో సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించారు. శిరీష చనిపోయిందని అక్కడి డాక్టర్లు చెప్పగానే.. వెంటనే వినయ్ సొంతూరు ఈగలపెంట తీసుకెళ్లే ప్రయత్నం చేశారు” అని ఏసీపీ తెలిపారు.