కామాంధుడు, స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

  • Published By: naveen ,Published On : July 2, 2020 / 03:57 PM IST
కామాంధుడు, స్వీట్ల ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి 9ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

పంజాబ్ రాష్ట్రం పటియాలాలో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. స్వీట్ల ఆశ చూపి 9ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. మాయమాటలతో నమ్మించి బాలికను పొలాల్లో తీసుకెళ్లిన ఆ నీచుడు దురాఘాతానికి పాల్పడ్డాడు.

స్వీట్ల ఆశ చూపి చిన్నారిపై అత్యాచారం:
పటియాలా జిల్లా సామ్నాలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లిదండ్రులు కూలీలు. బాలిక ఇంటికి ఎదురుగా యువకుడు నివాసం ఉంటున్నాడు. బాలికపై కన్నేసిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. నీకు స్వీట్లు కొనిస్తాను రా అంటూ బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన యువకుడు అక్కడ అత్యాచారం చేశాడు. దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక భయపడింది.

కామంతో కళ్లు మూసుకుపోయి:
కాగా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పాపను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన డాక్టర్లకు జరిగిన దారుణం గుర్తించారు. వెంటనే వారు తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. వారు బాలికతో మాట్లాడగా జరిగిన విషయాన్ని ఆ పాప చెప్పింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి అభంశుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

వదినపై అత్యాచారం:
గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో మరో దారుణం జరిగింది. 30 ఏళ్ల వ్యక్తి తన వదినపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కాగా ప్రస్తుతం ఆమె గర్భం దాల్చింది.

Read:కానిస్టేబుల్ పెళ్లి ఊరేగింపులో మొదటిభార్య ఎంట్రీ..షాక్ అయిన వరుడు..తెల్లబోయిన వధువు