AP TET 2024 Registration : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (ఫిబ్రవరి 18)తో ముగియనుంది. ఇప్పటివరకూ టెట్ పరీక్ష కోసం అప్లయ్ చేసుకోనివారు ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 19, 2024 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.
Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
అయితే, టెట్ పరీక్ష అడ్మిట్ కార్డ్లను ఫిబ్రవరి 23 నుంచి పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ విండో ఈరోజు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హత గల అభ్యర్థులు పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ టెట్ 2024 రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఇలా :
ఏపీ టెట్ పరీక్ష కోసం పేపర్ I, పేపర్ II పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9, 2024 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఏపీ టెట్ తుది ఫలితాలు మార్చి 14, 2024న వెల్లడి కానున్నాయి.