AP PGECET 2025 Results: ఏపీ పీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు పాసయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు పాసయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఏపీ పీజీఈసెట్ లో భాగంగా 13 సబ్జెక్టులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకోగా 11,244 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక త్వరలోనే కౌన్సెలింగ్ డేట్స్, షెడ్యూల్ కూడా ఖరారు చేయనున్నారు అధికారులు.