నిరుద్యోగులకు ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక ఏడాదిపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జులై 7 నుంచి 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో https://www.sthreenidhi.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01 జూన్ 2025 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.
దరఖాస్తు రుసుము: ఏ కేటగిరి వారైనా రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వేతన వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,520 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం: ముందు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తర్వాత అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ https://www.sthreenidhi.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.