హైదరాబాద్లోని నిరుద్యోగ యువత కోసం ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్ జిల్లా ఉపాధి అధికారి వందన ఓ ప్రకటనలో చెప్పారు.
మల్లేపల్లి గవర్నమెంట్ ఐటీఐలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో బుధవారం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. వైఎస్ఎఫ్ స్కిల్స్ సంస్థలో మొత్తం 100 ఉద్యోగాల కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 8-10వ తరగతి (ఉత్తీర్ణులు కాకపోయినా) మధ్య చదువుకున్న వారు, ఐటీఐ, డిగ్రీ ఉన్నవారు జాబ్ మేళాకు రావచ్చని అన్నారు.
బయోడేటాతో పాటు క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www. employment.telangana.gov.in చూడొచ్చని అన్నారు. లేదంటే 8328428933 నంబరుకు ఫోన్ చేసినా చెబుతారని తెలిపారు.