REET 2025 Application Process To Start Soon
REET 2025 : రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ (REET) 2024 పరీక్ష త్వరలో జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 25, 2025న పరీక్ష జరగాల్సింది. స్టేట్ ఎడ్యూకేషన్ ప్రకటించిన విధంగా రీట్ 2025 పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ డిసెంబర్ 1న ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు రీట్ పరీక్ష దరఖాస్తు చేసుకోవచ్చు.
రీట్ 2025 : ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండిలా :
రీట్ అనేది 1-5, 6-8 తరగతులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష. రీట్ 2024 పరీక్ష రెండు స్థాయిలుగా విభజించారు.
లెవల్ 1 : ఇందులో 5 సబ్జెక్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, చైల్డ్ డెవలప్మెంట్, పెడాగోజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. ప్రశ్నలు 10వ తరగతి క్లిష్ట స్థాయిని కలిగి ఉంటాయి. అభ్యర్థులకు పరీక్షను పూర్తి చేయడానికి 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.
లెవల్ 2 : ఈ పరీక్ష 300 మార్కులకు 150 మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (MCQ) కలిగి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు పొందుతారు. కానీ, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తొలగిస్తారు.