జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పుతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా..

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 08:10 AM IST
జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్

Updated On : April 18, 2019 / 8:10 AM IST

బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పుతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా..

బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ జీవీఎల్ నరసింహారావుపై చెప్పుతో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ చెప్పు ఆయనను తాకుతూ వెళ్లింది. దీంతో షాక్ అయ్యారు జీవీఎల్. వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యి అతన్ని పట్టుకున్నారు చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్ కు చెందిన డాక్టర్ భార్గవ్ గా గుర్తించారు.
Also Read : తేడావస్తే తాటతీస్తాడు : వర్మ బయోపిక్ టైగర్ కేసీఆర్

జీవీఎల్ పై చెప్పుతో దాడి చేసిన తర్వాత.. బీజేపీకి, జీవీఎల్ నరసింహారావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. జీవీఎల్ ను కొట్టటానికి కూడా ముందుకు దూసుకొచ్చాడు. సిబ్బంది ఆపకపోతే ఘోరం జరిగేది. ఎందుకు దాడి చేశాడు.. కారణాలు ఏంటీ అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. జీవిఎల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా.. అతనిపైకి చెప్పును విసిరారు. చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకున్న అక్కడి వ్యక్తులు పోలీసులకు అప్పగించారు. అయితే జీవీఎల్ పై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ చేసిన పనిగా దీనిని చెబుతుంది.