ఝాన్సీ సూసైడ్ కేసు : ఫోన్ లాక్ ఓపెన్ అయితే మిస్టరీ వీడినట్టే

హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఆమె సూసైడ్ కి కారణాలు ఇంకా తెలియలేదు. ఝాన్సీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 02:04 AM IST
ఝాన్సీ సూసైడ్ కేసు : ఫోన్ లాక్ ఓపెన్ అయితే మిస్టరీ వీడినట్టే

Updated On : February 8, 2019 / 2:04 AM IST

హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఆమె సూసైడ్ కి కారణాలు ఇంకా తెలియలేదు. ఝాన్సీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది

హైదరాబాద్ : టీవీ సీరియల్ నటి నాగ ఝాన్సీ(21) ఆత్మహత్య కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా ఆమె సూసైడ్‌కి కారణాలు ఇంకా తెలియలేదు. ఝాన్సీ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రియుడు సూర్య తేజను పోలీసులు ఇంతవరకు విచారించకపోవడం చర్చనీయాంశమైంది. కాగా ఈ కేసు విచారణను పోలీసులు స్పీడప్ చేశారు. ఈ కేసులో ఝాన్సీకి చెందిన రెండు మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అవే కీలక ఆధారాలు. ఆమె కాల్‌ డేటా, వాట్సప్‌ చాటింగ్‌లను పరిశీలిస్తున్నామని వివరించారు. చనిపోవడానికి ముందు 14 వాట్సప్‌ మెసెజ్‌లు చేసినట్లు సమాచారం.

 

వీటిలో ఒక ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేశారు. అందులో ఉన్న మెసేజేస్‌లో కొన్ని ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి వాటిని ఝాన్సీ డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లను టెక్నాలజీ సాయంతో అందుబాటులోకి తెచ్చేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా లాక్‌ ఓపెన్‌ అయిన ఫోన్‌లో పెద్దగా సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

 

మరో ఐ ఫోన్‌ లాక్‌ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదని పోలీసులు చెప్పారు. దాని లాక్ తెరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఓపెన్ అయితే ఈ కేసులో మిస్టరీ వీడొచ్చని పోలీసులు నమ్మకాలు పెట్టుకున్నారు. సూర్య తేజ వేధింపులతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. పోలీసులకు మాత్రం అందుకు అనుగుణంగా సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్‌ లాక్‌ తెరిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

 

2019 జనవరిలోనూ ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫిబ్రవరి 5వ తేదీ ఆమె సూసైడ్ చేసుకుంది. శ్రీనగర్‌ కాలనీలో సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని ఝాన్సీ చనిపోయింది. ఝాన్సీ సూసైడ్ ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ ఆరోపించింది. ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం. అయితే ఆ వీడియోలో ఏముందో పోలీసులు బయటకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఝాన్సీది ఆత్మహత్యా? ప్రేరేపిత ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.