Nigeria : నైజీరియాలో గన్మెన్ కాల్పుల్లో 14 మంది మృతి
నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో 14 మంది మరణించారు. నైజీరియా దేశంలోని వాయువ్య జంఫారా రాష్ట్రంలోని రెండు కమ్యూనిటీలకు చెందిన 60 మందిని ముష్కరులు కిడ్నాప్ చేశారు....
Nigeria : నైజీరియా దేశంలో ముష్కరుల దాడిలో 14 మంది మరణించారు. నైజీరియా దేశంలోని వాయువ్య జంఫారా రాష్ట్రంలోని రెండు కమ్యూనిటీలకు చెందిన 60 మందిని ముష్కరులు కిడ్నాప్ చేశారు. సాయుధ వ్యక్తులు రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి డజన్ల కొద్దీ మందిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు.
YS Sharmila : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్..! త్వరలో విలీనంపై అధికారిక ప్రకటన
నైజీరియాలో ముష్కరులు ఆదివారం 8 మందిని హతమార్చారు. (Gunmen Kill 14) దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు మిలిటరీ ఎస్కార్ట్లో వాహనాల కాన్వాయ్పై మెరుపుదాడికి పాల్పడ్డారని, ఇద్దరు సైనికులు, నలుగురు పౌరులు మరణించారని పోలీసులు చెప్పారు. (Kidnap 60 In Attacks In Nigeria) దాడి చేసిన వ్యక్తులు ఐదు వాహనాలకు నిప్పుపెట్టి, ఒక ట్రక్కుతో వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
మూడు గ్రూపులుగా ఉన్న ముష్కరులు ఆర్మీ స్థావరంపై దాడి చేశారు. బందిపోట్లు తుపాకులు, ఇతర ఆయుధాలతో అనేక మోటార్ సైకిళ్లను నడుపుతూ అప్పుడప్పుడు కాల్పులు జరుపుతున్నారని మాగామి నివాసి షుఐబు హరునా చెప్పారు. నైజీరియాలో ఇంధన రాయితీ తొలగింపు, ఆర్థిక సంస్కరణలతో ఆ దేశ పౌరులు ఆగ్రహం చెందారు.
Kangana Ranaut : చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కంగనా రనౌత్ ఫోటోలు..
జంఫారాలోని గ్రామీణ మాగామి కమ్యూనిటీలోని ఫార్వర్డ్ ఆర్మీ బేస్పై ఆదివారం తెల్లవారుజామున ముష్కరులు దాడికి ప్రయత్నించారని, అయితే దాడిని తిప్పికొట్టారని స్థానిక నివాసితులు తెలిపారు. ముఠాలు, వేర్పాటువాదులు ఆగ్నేయంలో భద్రతా దళాలు, ప్రభుత్వ భవనాలపై దాడి చేశారు.