కొత్త టెక్నాలజీ : మొబైల్ ఐసీయూ లు ఆవిష్కరణ

  • Publish Date - March 28, 2020 / 02:38 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 21 రోజలుపాటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించింది. ఒక వేళ వైరస్ వ్యాప్తి చెంది…..బాధితుల సంఖ్య పెరిగితే వారికి సరిపడినన్ని వైద్య సౌకర్యాలు లేకపోవటంతో ప్రభుత్వం ఎక్కడి కక్కడ వైరస్ వ్యాప్తిచెందకుండా నిషేధాజ్ఞలు విధించింది. 
 

కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే   చైనా వారం రోజుల్లోనే వెయ్యి పడకల ఆసుపత్రిని ఆఘమేఘాలమీద కట్టేసింది. అన్నిచోట్ల చైనా మాదిరి పరిస్థితులుండవు కదా.. అందుకే… కనెక్టెడ్‌ యూనిట్స్‌ ఫర్‌ రెస్పిరేటరీ ఎయిల్‌మెం (కూరా) షిప్పింగ్‌ కంటెయినర్లనే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లుగా మార్చేసేంది.

ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు వీలైన ఈ ఐసీయూలు విపత్కర పరిస్థితుల్లో బోలెడన్ని ప్రాణాలు కాపాడతాయనడంలో సందేహం లేదు. కార్లో రాట్టీ అసోసియాటీ, ఇటాలో రోటా, స్టూడియో ఎఫ్‌ఎం మిలానో, హ్యుమానిటాస్‌ రీసెర్చ్‌ హాస్పిటల్, జాకబ్స్, స్క్వింట్‌ ఓపెరా తదితర సంస్థలన్నీ కలిసి ఈ వినూత్న ఐసీయూలను డిజైన్‌ చేసి తయారు చేస్తున్నాయి.

నౌకల్లో సరుకుల రవాణాకు ఉపయోగించే 20 అడుగుల పొడవైన కంటెయినర్లను బాగా శుభ్రం చేసి.. కిటికీలు, తలుపులు ఏర్పా టు చేస్తారు. వీటిని ఒకదానితో ఒకటి కలిపేందుకు బుడగల్లాంటి నిర్మాణాలను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ గరిష్టంగా 40 పడకలతో కూడిన ఐసీయూ ఆసుపత్రిని సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవసరమైన వారెవరైనా ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారు చేసుకోవచ్చు. 

వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ కంటెయినర్లను నెగిటివ్‌ ప్రెషర్‌ తో కూడా రూపొందించవచ్చు. ఆస్పత్రులకు అనుబంధంగా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఐసీయూల సామర్థ్యాన్ని తక్కువ సమయంలో పెంచుకోవచ్చని అంచనా. క్షేత్రస్థాయి, తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటుకూ ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుతం కూరా తొలి నమూనా ఐసీయూను మిలాన్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తోంది.

Also Read | ముందుచూపు : చైనా పక్కనే..అయినా ఆ దేశం కరోనాను కట్టడి చేసింది..ఎలా