క్రైస్తవుల జీవితాలలో యోగాకు స్థానం లేదు – చర్చి ఆఫ్ గ్రీస్

  • Publish Date - June 6, 2020 / 05:43 AM IST

లాక్‌డౌన్ ఒత్తిడిని ఎదుర్కోవటానికి యోగాను ఉపయోగించడంపై గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసంలో యోగాకు స్థానం లేదని చర్చి ప్రకటించింది. ఎందుకంటే ఇది హిందూ మతంలో ఒక ప్రాథమిక భాగం అని చర్చి వెల్లడించింది. 

యోగా అనేది మా ఆర్థడాక్స్ విశ్వాసానికి పూర్తిగా విరుద్ధంగా ఉందని, క్రైస్తవుల జీవితంలో యోగాకు చోటు లేదని గ్రీస్ చర్చి యొక్క పాలకమండలి హోలీ సైనాడ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది హిందూ మతంలో ఒక ప్రాథమిక అధ్యాయమే కానీ,  శారీరక వ్యాయామం కాదని స్పష్టం చేసింది. యోగాను “ఒత్తిడిని ఎదుర్కోవటానికి” ఒక మార్గంగా గ్రీకు మీడియా సిఫారసు చేసిన తరువాత జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు హోలీ సైనాడ్ చెప్పింది. 

‘యోగా అభ్యాసానికి క్రైస్తవుల జీవితాలలో స్థానం లేదు’ అని చర్చ్ ఆఫ్ గ్రీస్ 2015 జూన్‌లో అధికారికంగా ప్రకటించింది. అవే కారణాలు ఇప్పుడు మళ్ళీ వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా సమాఖ్య ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మంది ప్రజలు యోగా సాధన చేస్తారు.

కానీ యోగా అనేది అంతర్గతంగా హిందూ కార్యకలాపం అనే దానిపై చర్చ జరుగుతోంది, ఇది సూర్య నమస్కారాలతో సహా ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగిస్తున్నందున, యోగా అనేది ‘వందనం’ నుండి ఉద్భవించిందని వారు చెబుతున్నారు. ఆర్థోడాక్స్ చర్చి గ్రీస్‌లోని అత్యంత శక్తివంతమైన సంస్థలలో ఒకటి.  మతమార్పిడి చేయడాన్ని నివారించడానికి ఈ సంస్థ చురుకుగా పనిచేస్తుంది. 

Read: కరోనా తర్వాత రెస్టారెంట్లలో ఎలా ఉండబోతుంది..