HariHara VeeraMallu : వీరమల్లు కూడా రెండు పార్టులుగా.. ఇరాన్లో గ్రాఫిక్ వర్క్స్..
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' రెండు పార్టులుగా రాబోతుందట. సినిమా గురించి నిర్మాత చెప్పిన విషయాలు..
HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించిన ఏ ఎం రత్నం.. ఇప్పుడు మరోసారి ఆ హీరోతో కలిసి చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. 17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వారియర్ గా నటిస్తున్నారు.
2020లోనే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ముందుగానే మొదలు పెట్టిన ఈ సినిమాని పక్కన పెట్టేసి, పవన్ ఇతర సినిమాలను పూర్తి చేస్తూ వస్తుండడంతో.. ఈ మూవీ పై అనేక రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా అవుట్ ఫుట్ పై పవన్ అసంతృప్తితో ఉన్నారని, అందుకనే మూవీని పక్కన పెట్టేశారని, సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.
Also read : Ashish3 : దెయ్యంతో కొత్త పెళ్ళికొడుకు ప్రేమాయణం.. ధైర్యం ఉంటే ప్రేమించు..
దర్శకనిర్మాతలు కూడా ఈ మూవీ విషయంలో సైలెంట్ గా ఉంటుండడంతో.. ఆడియన్స్ కూడా ఈ మూవీ ఆగిపోయిందని భావించారు. తాజాగా ఈ వార్తలకు నిర్మాత ఏఎం రత్నం రియాక్ట్ అవుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు. “వీరమల్లు సినిమా పవన్ కల్యాణ్ ని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పవర్ స్టార్ చేసే సినిమా” అని పేర్కొన్నారు. అలాగే తాను డబ్బు సంపాదన కోసం ఈ సినిమా చేయడం లేదని.. పవన్ మరియు తమ నిర్మాణ కెరీర్ లో ఈ చిత్రం నిలిచిపోయేలా, తెలుగు సినిమాకి మంచి పేరు తెచ్చేలా నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
“17వ శతాబ్దానికి సంబంధించిన సినిమా కాబట్టి చిత్రీకరణకు కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఎన్నికలు పూర్తవ్వగానే పవన్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొని మిగిలిన చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఇక ఇప్పటివరకు పూర్తయిన షూటింగ్ కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు ఇరాన్ వంటి దేశాల్లో జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాము. ఆల్రెడీ సెకండ్ పార్ట్ కోసం పనులు కూడా మొదలుపెట్టాం” అంటూ చెప్పుకొచ్చారు.
వీరమల్లు ఆగిపోలేదు అనే గుడ్ న్యూస్ చెప్పడమే కాకుండా, సినిమా రెండు భాగాలుగా రాబోతుందని గ్రేట్ న్యూస్ చెప్పి పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు.