RGV : ఆర్జీవీ ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం.. ఆర్జీవిపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కామెంట్స్..

ఆర్జీవీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.

RGV : ఆర్జీవీ ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం.. ఆర్జీవిపై ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కామెంట్స్..

AP Fiber Net Chairman GV Reddy Fires on RGV Regarding Vyuham Movie Scam

Updated On : December 24, 2024 / 5:06 PM IST

RGV : డైరెక్టర్ ఆర్జీవీ ఎన్నికల ముందు వైఎస్ జగన్ జీవిత కథతో ‘వ్యూహం’ అనే సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ చేసి వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేశారు. అప్పటి ప్రభుత్వం, ఏపీ ఫైబర్ నెట్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు వ్యూహం సినిమాకు గాను ఆర్జీవికి ఇచ్చారని ఆరోపణలు చేస్తూ ఇటీవల ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ ఆర్జీవికి, అప్పటి ఫైబర్ నెట్ ఎండీకి, మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు.

ఇటీవల దీని గురించి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మాట్లాడుతూ.. వ్యూహం సినిమాకు గాను ఫైబర్ నెట్‌ నుంచి 1.15 కోట్లు ఆర్జీవికి ఇచ్చారు. సాధారణంగా ఒక్కో వ్యూకి 100 రూపాయలు ఇస్తాము. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయి. ఈ లెక్కన ఈ సినిమాకు ఒక్కో వ్యూకు 11 వేల రూపాయలు ఇచ్చారని దానిపై వివరణ కోరుతూ ఆర్జీవికి లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు.

Also Read : Venkatesh Daughters : ముగ్గురు కూతుళ్లతో వెంకీమామ స్పెషల్ ఫోటో చూశారా.. బాలయ్య షోలో తన కూతుళ్ళ గురించి..

అయితే ఆర్జీవీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజుల్లోగా వ్యూహం సినిమాకి తప్పుడు మార్గంలో తీసుకున్న డబ్బులు ఆర్జీవీ తిరిగి చెల్లించాలి. లేకపోతే రామ్ గోపాల్ వర్మ మీద క్రిమినల్ కేసు పెడతాం. ఈసారి ఎలా తప్పించుకుంటాడో చూస్తాం. రామ్ గోపాల్ వర్మకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం. 15 రోజుల్లోగా డబ్బు తిరిగి చెల్లించాలని నోటీసులో తెలిపాము అని చెప్పారు.

అలాగే.. ఫైబర్ నెట్ లో విడుదల చేసిన వ్యూహం సినిమాకి 1863 వ్యూస్ వస్తే కోటిన్నర రూపాయలు ఎలాంటి అప్రూవల్ లేకుండా అగ్రిమెంట్ చేసుకోని ఇచ్చారు. సినిమా చూసినా చూడకపోయినా రెండు కోట్లు చెల్లించేలాగా ఫేక్ అగ్రిమెంట్ రాసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు లోకేష్ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా తీశారు కాబట్టే అప్పటి ప్రభుత్వం వ్యూహం సినిమాకి ఫేవర్ చేసింది అని అన్నారు.

Also Read : Allu Arjun : ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. అవసరమైతే మరోసారి విచారణకు రావాలన్న పోలీసులు..

చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు వ్యవహారంలో కూడా ఫైబర్ నెట్ ద్వారా వెళ్లిన ఫైల్స్ అన్నిటి మీద విచారణ జరుగుతుంది. దాంట్లో ఎవరి పాత్ర ఉన్న ఉపేక్షించేది లేదు అని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి తెలిపారు. మరి జీవి రెడ్డి కామెంట్స్ పై ఆర్జీవీ స్పందిస్తారా చూడాలి.