Diwali 2025 : సీనియర్ స్టార్ హీరోల ఫ్యామిలీలు.. దీపావళి స్పెషల్.. ఎవరెవరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారంటే..
తాజాగా చిరంజీవి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.(Diwali 2025)

Diwali 2025
Diwali 2025 : నేడు దీపావళి సందర్భంగా చిరంజీవి స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి సినీ ప్రముఖులను పిలిచారు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేష్ ఫ్యామిలీలతో సహా చిరంజీవి ఇంట్లో నిర్వహించిన దీపావళి పార్టీకి విచ్చేసారు. తాజాగా చిరంజీవి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.(Diwali 2025)
ఈ పార్టీకి నాగార్జున తన భార్య అమలతో, వెంకటేష్ తన భార్య నీరజతో వచ్చారు. అలాగే నయనతార కూడా ఈ పార్టీకి హాజరైంది. వీరందరికి చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి స్పెషల్ గిఫ్ట్స్ అందించారు. అలాగే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురూ కలిసి స్పెషల్ ఫోటో దిగారు.
Also Read : Nabha Natesh : దీపావళి స్పెషల్.. దీపాల వెలుగుల్లో చీరకట్టులో నభా నటేష్ మెరుపులు..
ఈ ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. ముగ్గురు హీరోలు ఉన్నారు బాలయ్య కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలను షేర్ చేసి చిరంజీవి.. నా ఫ్రెండ్స్ నాగార్జున, వెంకటేష్ ఫ్యామిలీలు, నా కో స్టార్ నయనతారతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా అంది. ఇలాంటి మూమెంట్స్ ప్రేమ, సంతోషంతో కూడుకొని జీవితంలో మరింత వెలుగుని పంచుతాయి అని పోస్ట్ చేసారు.
Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨
Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly… pic.twitter.com/qJHpVkk9og
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2025