Gopichand : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోపీచంద్..
భీమా సినిమా మార్చ్ 8న రిలీజ్ అవుతుండటంతో ప్రస్తుతం మూవీ యూనిట్ ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
![Gopichand : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోపీచంద్.. Gopichand : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గోపీచంద్..](https://10tv.in/wp-content/uploads/2024/02/gopichand.jpg)
Gopichand at Vijayawada Kanaka Durga Temple for Bhimaa Movie Promotions
Gopichand : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ త్వరలో ‘భీమా'(Bhimaa) సినిమాతో రాబోతున్నారు. కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడు. ఇప్పటికే భీమా సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు నెలకొల్పారు.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ అసలు పేరేంటి? పేరు మార్చగానే సినిమాల్లో కలిసొచ్చింది అంటూ..
భీమా సినిమా మార్చ్ 8న రిలీజ్ అవుతుండటంతో ప్రస్తుతం మూవీ యూనిట్ ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హీరో గోపీచంద్, మూవీ యూనిట్ నేడు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం నేడు గుంటూరులోని RVR, JC ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ తో ముచ్చటించనున్నారు.
Hero @YoursGopichand visited Goddess Kanaka Durga Temple in Vijayawada and took the divine blessings ✨🙏
He will be visiting the RVR & JC College of Engg, Guntur at 10:30 AM ❤️🔥#BHIMAA IN CINEMAS MARCH 8th💥#BHIMAAonMARCH8th@NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma… pic.twitter.com/yXKjf3w5Fy
— BHIMAA (@BhimaaMovie) February 17, 2024