Krishna Ghattam : కృష్ణాష్టమి సందర్భంగా ‘కృష్ణ ఘట్టం’ నుంచి కృష్ణుని పద్యం విడుదల
వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకం పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంతో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కృష్ణ ఘట్టం'.

Krishnudu Padyam Release
Krishna Ghattam : వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకం పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణంతో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కృష్ణ ఘట్టం'(Krishna Ghattam). ఈ చిత్రానికి మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ (Moody Crab Film Festival) 2022 లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award) తో సత్కరించారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి చాలా బాగుంది అని ప్రశంసించారు.
Jawan OTT : జవాన్ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కాగా.. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిత్రంలోని కృష్ణుడి పద్యాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సురేష్ పల్లా మాట్లాడుతూ.. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మా ‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరు అని ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకి శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యమన్నారు.

Krishnudu Padyam Release
Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్.. పవన్ అభిమానులకు పండగే..!
ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుందని చెప్పారు. ఒక దశాబ్ద కాలంలో ఇలాంటి తెలుగు పద్య నాటకం తెలుగు సినిమాల్లో ఎన్నడూ రాలేదన్నారు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిదన్నారు. ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ విడుదల చేశారు. సినిమా ట్రైలర్, పద్యనాటకం చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నట్లు చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.