Manoj Bajpayee : వారణాసి వెయ్యి కోట్ల బడ్జెట్.. అదంతా ప్రమోషన్ స్టంట్.. బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఈ బడ్జెట్ లు అన్ని ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. (Manoj Bajpayee)
Manoj Bajpayee
Manoj Bajpayee : రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం వారణాసి సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ రిలీజ్ కూడా టార్గెట్ చేసుకొని ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఇలా భారీ బడ్జెట్ సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి. వందలు, వేల కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్పేయ్ ఈ బడ్జెట్ లు అన్ని ఫేక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసాడు.
Also See : Dhootha 2 : సూపర్ హిట్ సిరీస్కు సీక్వెల్.. పూజా కార్యక్రమం ఫోటోలు..
బాజ్పేయ్ మాట్లాడుతూ.. వారణాసి, రామాయణం.. ఇలాంటి భారీ సినిమాల నిర్మాతలు వందల, వేల కోట్లు అంటూ ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే ఇది ఒక ప్రమోషన్ ఎత్తుగడ మాత్రమే. ఇదంతా పిఆర్ స్టంట్. గత 15 ఏళ్లుగా ఇలాంటి మాటలు చాలా సినిమాలకు వింటున్నాం. ఇది ఒక అంటువ్యాధిలా వ్యాపించింది. అసలు బడ్జెట్స్, కలెక్షన్స్ నిర్మాతలకు సంబంధించిన విషయం, బయటివాళ్లకు, ఫ్యాన్స్ కి ఎందుకు అవి. బాక్సాఫీస్ వసూళ్ల గురించి నిర్మాతలు చూసుకుంటారు మీకెందుకు. వాళ్లకు వచ్చే వందల కోట్ల రూపాయలలో మీకేమైనా ఇస్తారా. నన్ను కలిసేవాళ్ళు కూడా కలెక్షన్స్, బడ్జెట్స్ గురించి మాట్లాడతారు అని అన్నారు.
భారీ సినిమా బడ్జెట్స్ అన్ని కేవలం ప్రచారం కోసమే అంత ఎక్కువగా చెప్తున్నారని మనోజ్ అనడంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
