Mahesh Babu Foundation : గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం.. 300 మంది వ్యక్తులతో MB ఫౌండేషన్..

గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం MB ఫౌండేషన్ రీసెంట్ గా హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో..

Mahesh Babu Foundation : గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల కోసం.. 300 మంది వ్యక్తులతో MB ఫౌండేషన్..

Namrata at Mahesh Babu Foundation Heartathon event

Mahesh Babu Foundation : సూపర్ స్టార్ మహేష్ బాబు తన MB ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పిల్లలకు గుండె చప్పుడు అవుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ చేసే ఈ మంచి పనిలో ఔట్‌రీచ్ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్శిటీ కూడా భాగం అవుతుంది. రీసెంట్ గా ఈ రెండు సంస్థలు కలిసి.. గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లలకు మద్దతుగా ఒక కార్యక్రమం నిర్వహించాయి.

పిల్లల గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా మరియు ఈ సేవా నిధులను పెంచడం లక్ష్యంగా పెట్టుకొని.. మార్చి 16న హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో సుమారు 300 మంది వ్యక్తులతో ‘హార్ట్‌థాన్’ పేరిట ఒక రన్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న 300 మంది వ్యక్తులు 3కి.మీ నుంచి 5కి.మీ మార్గంలో రన్ చేసి MB ఫౌండేషన్, ఔట్‌రీచ్ క్లబ్ చేస్తున్న గొప్ప పనికి తోడుగా నిలిచారు.

Also read : Tollywood New Movies : టాలీవుడ్ కొత్త సినిమాల స్టోరీ లైన్స్ చెబుతూ.. అమెజాన్ ప్రైమ్ పోస్టులు వైరల్..

ఇక రన్ లో విజేతలుగా నిలిచిన వారికి మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్.. అవార్డులు ఇచ్చి సత్కరించారు. అలాగే ఈ మంచి కార్యక్రమంలో అంకితభావంతో పాల్గొన్న వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక అవార్డులను అందించిన నమ్రత మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పోరాడుతున్న పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకురావడం కోసం చేసిన ఈ హార్ట్‌థాన్ మహేష్ బాబు ఫౌండేషన్ మరియు ఔట్‌రీచ్ క్లబ్‌ల నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.

కాగా ఈ అవార్డు ఈవెంట్ లో విజేతలో ఫొటో దిగి నమ్రత వారిని సంతోష పరిచారు. ఈ ఫోటోలను MB ఫౌండేషన్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg)